రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది : కన్నడ హీరో దర్శన్

-

రేణుకా స్వామి ఆత్మ తనను వెంటాడుతోందని కన్నడ నటుడు దర్శన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని, ఒంటరిగా ఉంటే భయమేస్తోందన్నారు. తనను బెంగళూరు జైలుకు తరలించాలని అధికారులను వేడుకుంటున్నాడు. తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్.. ప్రస్తుతం విచారణ ఖైదీగా బళ్లారి జైల్లో ఉన్నాడు.

ఈ కేసులో దర్శన్‌, పవిత్ర గౌడలతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో దర్శన్‌ని పరప్పన్ అగ్రహారంలోని సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉంచారు. ఇటీవలే కోర్టు ఆదేశాలతో దర్శన్‌ను పరప్పన్ సెంట్రల్ జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించారు. అయితే, బళ్లారి జైలు నచ్చకపోవడం వల్లే దర్శన్ ఇలాంటి స్టోరీలు అల్లుతున్నాడనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news