బందరులో దారుణ రేప్… బాధితురాలు ఏమంది…?

-

కృష్ణా జిల్లా బందరులో దారుణం జరిగింది. మచిలీపట్నం మండలం‌ కోన గ్రామంలో రేప్ ఘటన జరిగింది. ఆటో ఎక్కిన యువతిని బలవంతంగా గదిలో బంధించి అత్యాచారం చేసారు. నిందితునికి అతని సోదరుడు సహకరించాడు అని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు… తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కాను అని ఆమె వాపోయింది.

మధ్యలో సామాన్లు తీసుకెళ్లాలని ఆటో మరో రోడ్డులోకి తిప్పాడు అని, అక్కడ షామియానా సామాన్లు అందించాలని కోరారు అని తెలిపింది. నేను ఆటో దిగి లోపలికి వెళ్లగానే మరో వ్యక్తి బయట గడియ పెట్టాడు అని ఆమె వెల్లడించింది. రామాంజనేయులు అనే వ్యక్తి నా పై అత్యాచారం చేశాడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సోదరుడు నాగబాబు అతనికి సహకరించాడు అని, వారిద్దరి పై చర్యలు తీసుకోవాలి అని ఆమె కోరింది. బాధితురాలి బాబాయి మాట్లాడుతూ మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు అని ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version