మహేష్ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ఆగిపోవడానికి కారణం..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే కొన్ని కారణాల చేత మహేష్ బాబు కొన్ని చిత్రాలను రిజెక్ట్ చేయడం జరిగింది. మరి కొన్ని సినిమాలు కొన్ని కారణాల చేత ఆగిపోయాయి. అలా మహేష్ బాబును మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే సినిమాని ఎంపిక చేశారట ఆర్ఆర్ మూవీ మేకర్స్ వాళ్ళు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాలని
అనుకున్నట్లు సమాచారం.

కానీ మహేష్ అప్పట్లో ఖలేజా సినిమా షూటింగ్ సమయంలో ఉన్న మహేష్ ని కలిసి ఒక డాన్ టైప్ కథ అని చెప్పారట. అయితే గతంలో కూడా మహేష్ బాబు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన అతిధి మూవీ ప్లాప్ అయినా కూడా .. డైరెక్టర్ మీద నమ్మకంతో మహేష్ ఓకే చేశారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించేది మేమే అన్నట్లుగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు ప్రకటించడం జరిగింది. అయితే అప్పటివరకు ఏ సినిమాకు పెట్టుబడి ఖర్చు.. రూ.45 కోట్లు.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు.

ఈ సినిమా కోసం మహేష్ బాబు కు రూ.2.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది హీరోయిన్గా కరిష్మా కపూర్ ను ఎంపిక చేశారట. ఖలేజా సినిమా విడుదల తర్వాత 2010లో షూటింగ్ ప్రారంభిస్తామని అటు మహేష్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి పలు ప్రకటనలు వెలుపడ్డాయి. కానీ కొన్ని కారణాల చేత ఈ మూవీ ప్రొడ్యూసర్ వాళ్లు నష్టాలను తట్టుకోలేకపోయారు. కనీసం ప్రీ ప్రొడక్షన్ పనులకు కూడా డబ్బులు లేకపోవడంతో మహేష్ తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారు. ఇక తర్వాత సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తో ఊసరవెల్లి తీయగా డైరెక్టర్ దశరథ్ మాత్రం ప్రభాస్ తో మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాని తీశారు. మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ ను ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారికి ప్రభాస్ ఫోన్ చేసి అడగడంతో ఓకే చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version