సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలన్న వ్యాజ్యంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

-

సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలన్న వ్యాజ్యంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని పరిశీలించడానికి కోర్టు సరైన వేదిక కాదని పేర్కొంది. ఈ అభ్యర్థనను పార్లమెంటులో లేవనెత్తాలి కానీ కోర్టుల్లో కాదని స్పష్టం చేసింది. సంస్కృతాన్ని భారత జాతీయ భాషగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది.

‘‘మీ అభ్యర్థనను సంస్కృతంలో రాయండి. ప్రచారం కోసం నోటీసులు జారీ చేయడంగానీ, ప్రకటనలు చేయడంగానీ ఎందుకు..? మీ అభిప్రాయాల్లో కొన్నింటితో మేము ఏకీభవించొచ్చు. కానీ, ఈ అంశాన్ని చర్చించడానికి సరైన వేదిక పార్లమెంట్‌. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. ఇది పాలసీలకు సంబంధించిన విషయం. దీనిని మేం మార్చలేం’’ అని న్యాయస్థానం పేర్కొంది. అనంతరం ఈ పిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

ఈ పిల్‌ను గుజరాత్‌ మాజీ అదనపు సెక్రటరీ కె.జి.వంజార దాఖలు చేశారు. హిందీతోపాటు సంస్కృతాన్ని కూడా జాతీయ భాషగా పేర్కొనాలని కోరారు. సంస్కృత ఉచ్ఛారణలో జీవశక్తి ఉంటుంది. ఇది మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని.. దీని లయబద్ధమైన ఉచ్ఛారణ పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుందని ఈ పిల్‌లో పేర్కొన్నారు.supr

Read more RELATED
Recommended to you

Exit mobile version