ప్రపంచానికి శాంతి కావాలి.. ఘర్షణలు వద్దు : భారత్, పాక్‌‌కు ట్రంప్ పిలుపు

-

టెర్రరిస్టుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి జరిపిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పాకిస్థాన్‌కు వణుకు పుట్టిస్తోంది. బవహల్పూర్‌‌లోని జైష్-ఎ-మహమ్మద్‌, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులు చేసింది. ఈ ఘటనల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

తాజాగా ఆపరేషన్ సింధూర్ ‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరుదేశాలు ఉద్రిక్తతలు ఇరు దేశాలు తగ్గించుకోవాలని సూచించారు. భారత్ , పాకిస్తాన్ నడుమ పరిస్థితిలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. భారత్, పాక్‌లు దశాబ్దాలుగా గొడవ పడుతున్నాయని.. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరని హితవు పలికారు.ప్రపంచానికి శాంతి కావాలి.. ఘర్షణలు వద్దని ట్రంప్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news