అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య..సెల్ఫీ వీడియో తీసి మరీ !

-

అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన తూ.గో..అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెం లో చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని మాగం కొప్పిశెట్టివారి పాలెం కు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కోప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు గత కొంతకాలంగా అదే గ్రామంలోని ఒక అమ్మాయితో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. అయితే ఇటీవలే ఆ యువకుణ్ణి ఆ అమ్మాయి వదిలేసింది.

దీంతో ప్రేమ పేరుతో తన వద్ద నుండి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు వేరే పెళ్ళి చేసుకుంటుందని యువకుడు సెల్ఫీ వీడియో చేసి సూసైడ్ చేసుకున్నాడు. తన ఆవేదనను తెలిపేందుకు వాట్స్ గ్రోపులు క్రియేట్ చేసి గ్రూపులలో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలో షేర్ చేసిన యువకుడు.. అమ్మాయి మోసం చేసినందుకే చనిపోతున్న అంటూ సెల్ఫ్ వీడియో తీశాడు. అయితే గతంలోనే ఈ యువకుడు కి పెళ్ళై నట్టు, బార్య భర్తలు విడిపోయినట్టు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version