హిందువుల పండుగలను వారు టార్గెట్ చేస్తున్నారు : రాజాసింగ్

-

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద వినాయక నిమజ్జనాలపై నిషేధం విధించడాన్ని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఓ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిమజ్జనాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కచ్చితమైన ప్రకటన చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో వినాయకచవితి జరుపుకుంటున్న ప్రజలంతా మీ వైపు, మీ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. వాళ్లకోసం మీరు కచ్చితమైన ప్రకటన చేయండి’అని రేవంత్ రెడ్డిని కోరారు. ఎన్నో ఏళ్లుగా వినాయక నిమజ్జనాలు ట్యాంబ్‌బండ్‌ వద్ద చేస్తున్నారని, అలాంటప్పుడు కొత్తగా ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం విడ్డూరమని, కేవలం హిందూ పండుగల విషయంలోనే ఇలా జరుగుతుండటం ఆలోచించాల్సిన విషయమన్నారు. ఇదంతా చూస్తుంటే హిందూ వ్యతిరేక శక్తులు హిందువుల పండుగలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని ఫైర్ అయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version