సెమీస్‌కు చేరేది ఆ నాలుగు జట్లే… జోస్ బట్లర్

-

T20 వరల్డ్‌కప్‌ 2024 లో ఏ జట్లు సెమిస్కు చేరుతాయని పలువురు మాజీలు క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈసారి ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా,ఇంగ్లండ్‌, టీమిండియా, వెస్టిండీస్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. బట్లర్‌ తన అంచనాల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాకు చోటివ్వకపోవడం గమనార్హం.

కాగా, ఇంగ్లండ్‌ నిన్న (జూన్‌ 4) స్కాట్లాండ్‌తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ వచ్చింది. సూపర్‌-8 చేరే క్రమంలో ఇంగ్లండ్‌కు ఇది అంత శుభపరిణామం కాదు. ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌ పోటీపడుతున్న గ్రూప్‌లోనే ఆస్ట్రేలియా, నమీబియా, ఒమన్‌ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో మొదటి 2 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతానికి ఒమన్‌తో ఆడిన ఒక్క మ్యాచ్‌లో గెలిచిన నమీబియా 2 పాయింట్లు ఖాతాలో కలిగి టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌ను ఇంకా ఆడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news