ఏపీలో దారుణం జరిగింది. ఈత సరదా.. ప్రాణం తీసింది. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం గుంటసీమ సమీపంలోని చెరువుకు వెళ్లి ముగ్గురు మైనర్లు మృతి చెందారు. మృతులు గుంట భాను తేజ, గుంట సాయికిరణ్, కొర్ర సుశాంత్ గా గుర్తించారు.

ఈ ఘటనా స్థలంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.