మంత్రి పదవి దక్కకపోవడం పై తీవ్ర అసంతృప్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఉన్నారని సమాచారం అందుతోంది. రాహుల్ గాందీకి లేఖ రాస్తానంటున్నారు మల్ రెడ్డి రంగారెడ్డి. మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్నారు మల్ రెడ్డి రంగారెడ్డి.

ఇవాళ సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి. అటు అలిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు … ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకొని అందుబాటులో లేకుండా పోయారట.
ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారట మీనాక్షి నటరాజన్. అందుబాటులో లేకుండా పోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకొని అందుబాటులో లేకుండా పోయారట.