ఈ మధ్యకాలంలో ఎన్నో కారణాల వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి, ముఖ్యంగా షుగర్, బీపీ, జీర్ణ సమస్యలు ఎంతో సాధారణంగా మారుతున్నాయి. అందువలన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో కష్టం అయ్యింది అనే చెప్పవచ్చు. అయితే, వీటిని తగ్గించడానికి మరియు మంచి ఫలితాలను పొందడానికి పనీర్ పూలు ఉపయోగపడతాయి కాకపోతే వీటి గురించి చాలా తక్కువ శాతం మంది విని ఉంటారు. వీటి వలన షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయవచ్చు మరియు బీపీ, జీర్ణ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు అని న్యూట్రిషనిస్ట్లు చెప్తున్నారు.
చాలామంది షుగర్ తగ్గించడానికి ఎన్నో చిట్కాలను ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం, ఆయుర్వేదంలో చెప్పిన మందులను ఉపయోగించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం వంటివి చేస్తారు. అయితే, ఎటువంటి ప్రయోజనం లేకపోతే ఈ పనీర్ పూలను ఉపయోగించండి. దీనిని పేరు పనీర్ దొడ, అని కూడా అంటారు. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ ను ఈ పూలను ఉపయోగించమని సూచిస్తున్నారు. ఈ పూలు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. అయితే, వీటిని ఉపయోగించే ముందు 8 నుంచి 10 పనీర్ పూలను తీసుకొని వాటిని ఎండబెట్టుకోవాలి లేదా ఎండిన పూలను కూడా కొనుక్కోవచ్చు.
వాటిని తీసుకొని ఒక గ్లాసు నీళ్లలో వేయాలి. రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఆ పూలను ఆ నీటిలో గట్టిగా పిండి, ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే సహజంగానే రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. కనుక, వీటిని క్రమంగా ప్రతిరోజు తీసుకుని షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేసుకోవడంతో పాటు నీరసం, కళ్ళు తిరగడం, తలనొప్పి వంటి ఇతర లక్షణాలను కూడా తగ్గించుకోవచ్చు. కేవలం మెడికేషన్ పై ఆధారపడకుండా, ఇటువంటి చిట్కాలను పాటించడం వలన డయాబెటిస్ ను నియంత్రించుకోవచ్చు అని న్యూట్రిషనిస్ట్లు చెబుతున్నారు.