శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

-

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ శివారులో గురువారం రాత్రి జరిగిన ఎన్‌‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో పోలీస్ బస్సుపై దాడితో సంబంధం ఉన్న ఉగ్రవాది కూడా ఉన్నాడు. పటాన్‌కోట్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులతోపాటు ఒ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు.

శ్రీనగర్ శివారుల్లోని జివన్ పోలీస్ క్యాంప్ వద్ద పోలీస్ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా ముగ్గురు పోలీసులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది సుహేల్ అహ్మద్ రాతర్ గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలను కోల్పోయాడు.

పోలీస్ బస్సుపై దాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు కూడా వేర్వేరు ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఇటీవల జమ్ముకశ్మీర్‌ కుల్గాం, అనంత్‌నాగ్ జిల్లాల్లో భద్రతా బలగాల రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు పాకిస్తాన్ పౌరులతో సహా ఆరుగురు ఉగ్రవాదులు ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version