నేడు తిరుపతిలో జగన్‌ పర్యటన.. వివరాలు ఇవే..!

-

నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు విద్యా దీవెన పథకం బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు సీఎం జగన్‌ బయలుదేరుతారు. అనంతరం 11.30 గంటలకు ఎస్వీ యూనివర్శిటీకి సీఎ జగన్‌ చేరుకుంటారు. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో మాట్లాడనున్నారు సీఎం జగన్.. అనంతరం 12 గంటలకు సీఎం ప్రసంగం వుంటుందని వెల్లడించారు.

ఒంటి గంటకు పద్మావతి పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కు భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి టాటా క్యాన్సర్ కేర్ సెంటర్ ను ప్రారంభింస్తారు. అక్కడి రేడియాలజీ, రేడియోథరెపీ, ఏవీ ప్రజెంటేషన్ పరిశీలించి.. మధ్యాహ్నం 2.30 గంటలకు రేణిగుంట నుంచి సీఎం జగన్‌ తిరుగు ప్రయాణమై.. 3.30 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version