బ్యాడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు పెరిగాయ్..తెలుసుకోండిలా..!

-

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు పెరిగాయి. సోమవారం నిలకడగా ఉన్న బంగారం, వెండి ధరలు మంగళవారం పెరిగాయి. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం రూ. 110 పెరగగా 22 క్యారెట్ల బంగారం పై 100 రూపాయలు పెరిగింది. దేశంలో 24 క్యారెట్ల బంగారం రూ. 48,880 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,800గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 51,220గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,950గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 47,870 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,870గా పలుకుతోంది. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం రూ. 48,800 కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,800గా విక్రయాలు జరుగుతున్నాయి.

బంగారం-వెండి

ఇక కిలో వెండిపై 100 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరతో కలిపి కేజీ వెండి రూ. 72,100గా ఉంది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..

Read more RELATED
Recommended to you

Exit mobile version