Breaking : రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్‌ వినియోగం

-

ఈరోజు మన రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ వినియోగం జరిగింది. అనుకున్న విధంగానే మార్చి నెలలో 15వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదు కావడం జరిగింది. మంగళవారం ఉదయం 10 : 03 గంటలకు 15,062 మెగా వాట్ల విద్యుత్‌ వినియోగం జరిగినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు తెలిపారు. నిన్న 14,138 మెగా వాట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది.

మన రాష్ట్రంలో రోజురోజుకీ విద్యుత్‌ వినియోగం పెరుగుతోందని అన్నారు ప్రభాకర్‌రావు . సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్‌ డిమాండ్‌ కూడా పెరిగిందని అన్నారు ఆయన. తెలంగాణాలో మొత్తం విద్యుత్‌ డిమాండ్‌లో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగించబడుతోందని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్‌ వినియోగం చేస్తున్న రాష్ట్రం మన తెలంగాణనే అని ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు.

 

గత సంవత్సరం మార్చి నెలలో అత్యధికంగా 14,160 మెగా వాట్ల విద్యుత్‌ వినియోగం జరిగిందని సీఎండీ తెలిపారు. డిసెంబర్‌లో ఈ రికార్డును అధిగమిస్తూ 14,750 మెగా వాట్ల విద్యుత్‌ వినియోగం జరిగిందన్నారు. కాగా తాజాగా మంగళవారం 15,062 మెగావాట్ల విద్యుత్‌ వినియోగమైందని అన్నారు. మార్చి నెలలో 15వేల మెగా వాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదవుతుందని ముందే ఊహించామని సీఎండీ ప్రభాకర్‌ రావు పేర్కొన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యుత్‌ అంతరాయం లేకుండా సరఫరాకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని చేపట్టామన్నారు. కాగా ఈ ఏడాది వేసవి కాలంలో 16వేల మెగా వాట్లకు పైగా డిమాండ్‌ ఏర్పడవచ్చని అంచనా వేశారు సీఎండీ ప్రభాకర్ రావు. ఎంత డిమాండ్‌ వచ్చినా కూడా ఎలాంటి అంతరాయం తాము విద్యుత్‌ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version