12 మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలపై మొయినాబాద్​ పీఎస్​లో కాంగ్రెస్ ఫిర్యాదు

-

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై పీసీసీ నాయకులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్‌ నేతలతో కూడిన బృందం సీఎల్పీలో సమావేశమై చర్చించింది. అనంతరం మొయినాబాద్ పీఎస్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. గతంలో జరిగిన ఫిరాయింపులపై ఇప్పుడు ఫోకస్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్‌లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్​లో చేరినందుకు వారికి కలిగిన రాజకీయ, ఆర్థిక లబ్ధి గురించి హస్తం నాయకులు ఫిర్యాదులో సవివరంగా పేర్కొన్నారు. కవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version