నన్ను పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతోంది- వీహెచ్

-

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికార పక్షంతో పోరాడటం పక్కన ఉంచితే స్వపక్షంలో విపక్షాలు తయారవుతున్నాయి. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల తనకు అవమానం జరిగిందని.. తనను అవమానపరిచిన మంచిర్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పట్టుబట్టాడు. ప్రస్తుతం ఈ షోకాజ్ నోటిసే కాంగ్రెస్ పార్టీలో రచ్చకు కారణం అవుతోంది. ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఏమీ లేదంటూ.. వీహెచ్ విమర్శిస్తున్నారు. మంచిర్యాలలో మాకు అవమానం జరిగితే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం వెంటనే నిర్వహించాలని వీహెచ్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రేమ్ సాగర్ రావుపై పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల కోసం వెళ్తే అవమానించారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version