హైదరాబాద్ వాసులు అలర్ట్.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

-

హైదరాబాద్ లో ఇవాళ షీటీమ్స్ ఆధ్వర్యంలో…5k, 2k రన్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నగర ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రన్ జరుగునున్న పీపుల్స్ ప్లాజా, లేపాక్షి,, ట్యాంక్ బండ్ మరియు పీవిఎన్ ఆర్ మార్కెట్ ప్రాంతంలో… ఉదయం 5 గంటల సమయం నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా… వెళ్లే వాహనాలను షాదన్ కాలేజ్, నిరంకారీ భవన్‌ మీదుగా మళ్లిస్తారు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను అంబేద్కర్‌ విగ్రహం దగ్గర మళ్లించి.. తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ మీదుగా మళ్లిస్తారు. ఇక్బార్‌ మీనార్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ మీదుగా మళ్లిస్తారు. సంజీవయ్య పార్కు నుంచి వచ్చే వాహనాలను నల్లకుంట జంక్షన్‌ నుంచి రాణిగంజ్‌ క్రాస్‌ రోడ్డు మీదుగా అనుమతిస్తారు. రన్‌ కోసం వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version