సెలబ్రిటీలు ట్రొలింగ్ బారిన ఎందుకు..!!

-

ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతుకుతున్న సోషల్ మీడియా ప్రపంచంలో ట్రోలింగ్ అనేది సాదారణ విషయంగా మారింది. దీనికి రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, బాబాలు అనే తేడా లేకుండా పోయింది. ట్రొలింగ్ రాయాళ్లు వదిలే ప్రసక్తే లేకుండా వుంది. ఇది మనుషుల్లో వచ్చిన ప్రవర్తన లో మార్పా అనేది అర్థం కాకుండా వుంది.

తాజాగా అసలు ట్రోలింగ్ ఎందుకు జరుగుతోందని ఒక మీడియా సర్వే నిర్వహించింది. దానికి ట్రోలింగ్ చేసే వారు ఆసక్తికరంగా స్పందించారట.ఒకప్పుడు సెలబ్రిటీలు అంటే చాలా గౌరవం ఉండేది. తిరుమల కు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మళ్లీ మద్రాస్ వెళ్లి అక్కడ నందమూరి తారక రామారావు గారికి నమస్కరించి వచ్చే వారు. కాని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం తుమ్మినా, దగ్గినా, బాత్ రూం నుండి బెడ్ రూం వరకు ఫోటోలు అర్ధనగ్నంగా ఫోటోస్ పెడుతున్నారు అందుకే మేము కూడా రెచ్చి పోయి ట్రోలింగ్ చేస్తామని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు.

ఇక ఇప్పుడు కంపెనీ లు ఇచ్చే ప్రమోషన్ డబ్భులు కోసం సెలబ్రిటీలు హాట్ హాట్ ఫోటోలు పెడుతున్నారు. దాచుకోవల్సిన విషయాలు కూడా పబ్లిక్ లో పెడుతున్నారు. హనీమూన్ ట్రిప్ గురించి, బీచ్ ఎంజాయ్ మెంట్ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. అందుకే మేము విమర్శలు చేస్తామని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version