విషమంగానే టీఆర్ఎస్ నేత నాయిని ఆరోగ్యం

-

టీఆర్ఎస్ నేత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది..కరోనా నుంచి కోలుకోన్న నాయిని న్యూమోనియా వ్యాధితో  జూబ్లిహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..కరోనా నెగిటివ్‌ వచ్చిన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ తర్వాత ఆయనకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు..నాయిని న్యూమోనియాతో బాధపడుతున్నాడని ఆస్పత్రికి తరలించారు..ప్రస్తుతం నాయిని అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారు.


ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా సోకింది. మంత్రులు హరీష్ రావు,మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు కరోన బారిన పడ కోలుకున్న విషయం తెలిసిందే. నాయిని ఆరోగ్యంపై టీఆర్ఎస్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version