కేసీఆర్‌ ప్రధాని కావాలని.. క్వార్టర్ బాటిల్లను పంపిణీ చేసిన టీఆర్‌ఎస్‌ నేతలు !

-

బ్రేకింగ్ న్యూస్ : పేద హమాలీలకు 200 కోళ్లను మరియు 200 క్వార్టర్ బాటిల్లను పంపిణీ చేశారు టీఆర్‌ఎస్‌ నేత రాజనాల శ్రీహరి. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో సంఘటన చోటు చేసుకుంది.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టబోతున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టీఆర్‌ఎస్‌ నేతలు.

అంతేకాదు.. సీఎం కేసీఆర్‌.. దేశ ప్రధానమంత్రి కావాలని అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుని గా కల్వకుంట్ల తారకరామారావు గారు ఎంపికై రాబోయే ఎన్నికల్లో వారు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version