రేవంత్ రెడ్డి 420.. పెద్ద లోఫర్ : టిఆర్ఎస్ ఎమ్మెల్సీ

-

రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ఫైర్ అయ్యారు. కెసిఆర్ కుటుంబాన్ని విమర్శించే హక్కు రేవంత్ కు లేదని…రేవంత్ ఎవడికి తెలుసు ?కోన్ కిస్కా గాడు ! అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక 420 అని , పెద్ద లోఫర్ అని ఫైర్ అయ్యారు. రేవంత్ ను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలన్నారు.ఇంద్రవెల్లి సభ తో రేవంత్ నీచ ,నిజ స్వరూపం బయట పడిందని…40 యేండ్ల క్రితం ఇంద్రవెల్లి లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆదివాసీలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపాయన్నారు.

ఆ ఘటన జరిగినపుడు రేవంత్ మహబూబ్ నగర్ లో పెయింటింగ్ లు వేసుకుని బతుకుతున్నారేమోనని…రేవంత్ కు చరిత్ర తెలియదు …ఆ ఘటన తో భాధపడ్డవారికి క్షమాపణ చెప్పాలని సోయి కూడా లేదని నిప్పులు చెరిగారు. సమైక్య పాలనలో జోడేఘాట్ స్థూపం దగ్గర కు ఎవ్వరినీ వెళ్లనివ్వని చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదని మండిపడ్డారు. కెసిఆర్ సీఎం అయ్యాక అక్కడకు వెళ్లి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని..భారీ స్థూపం ,డబుల్ రోడ్డు కెసిఆర్ చలవేన్నారు.తెలంగాణ ఏర్పడ్డాకే కొమరం బీమ్ ప్రాధాన్యత పెరిగిందనీ..ప్రత్యేకంగా కొమురం భీం జిల్లాను ఏర్పాటు చేశామన్నారు. ఇంద్రవెల్లి సభకు లక్ష మంది లేకపోతే తల నరుక్కుంటా అన్నావ్ ..నేను నిరూపిస్తా రేవంత్ 20 వేలకు మించి రాలేదని …తల నరుక్కో ? అని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version