తెలంగాణ గవర్నర్‌తో సీఎస్, హెల్త్ సెక్రటరీ భేటీ..!

-

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌తో సీఎస్ సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి శాంతకుమారి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న క‌రోనా ప‌రిస్థితులు, కరోనాను కట్టడి చేసేందుకు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు, పరీక్షలు, ప్రైవేటు ఆసుప‌త్రుల అధిక బిల్లులు, జీహెచ్ఎంసీలో అత్యధిక కేసులు నమోదు వంటి అంశాలపై వారితో గవర్నర్ చర్చించినట్లు సమాచారం.

వాస్తవానికి సోమవారమే రాజ్‌భవన్‌కు రావాలని సీఎస్, ఆరోగ్యశాఖ కార్యదర్శికి గవర్నర్ తమిళిసై వర్తమానం పంపారు. అయితే సీఎంతో భేటీ కావాల్సిన నేపథ్యంలో, వారు గవర్నర్ తో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version