శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు

-

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల కలియుగ వైకుంఠవాసుని ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఈ మేరకు నవంబర్‌ 11న ఉదయం 10 గంటలకు టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు. డిసెంబర్‌ నెలకు సంబంధించిన టిక్కెట్లను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) కల్పించే రూ.300 టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనున్నారు టీటీడీ అధికారులు. కాగా.. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల దర్శనాలు రద్దు చేసింది. కేవలం సర్వదర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఆయా తేదీలను చూసుకొని, టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం కేవలం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. దీంతో భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. నిన్న తిరుమల శ్రీవారిని 22,423 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 9,679 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక తిరుమలకు భక్తులు పోటెత్తడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ముందస్తు ప్రణాళికతో బస, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version