టిఆర్ఎస్ పై తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు !

-

ఖమ్మం జిల్లా ; నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు లో ఓ ప్రవైట్ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు…ఖమ్మం జిల్లా గా పాలేరు నియోజకవర్గంని చూశానని.. కులమతాలకు, పార్టీల అతీతంగా అభివృద్ధి కి కృషి చేశానని పేర్కొన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో మీ ఆశీస్సులతో బై ఎలక్షన్ లో గెలుపొందిన మీ నియోజకవర్గం లోని గ్రామాల ముఖచిత్రాన్ని మార్చేశానని…టిఆర్ఎస్ పార్టీ వల్లే తన పేరు మరింత పెరిగిందన్నారు.

ఖమ్మం జిల్లాలోనే పది నియోజకవర్గాల అభివృద్ధి,చేసి నలభై సంవత్సరాలుగా అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయం చేశా రాజకీయం కోసం నేను రాజకీయం చేయలేదు…నియోజకవర్గంలో అన్ని విధాల ప్రభుత్వ పథకాలను అమలు చేసి నియోజకవర్గ ప్రజల అవసరాలను తీర్చానన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి తో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని,, గ్రామాల్లో సమస్యల కోసం నా దగ్గరకు రానివ్వడం లేదు ప్రజాసమస్యలు నా చెవికి వినబడితే చాలు అవి పూర్తి చేసే శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడని వెల్లడించారు… ప్రజా కోరికతో పార్టీ నిర్ణయం తో మళ్లీమీ ముందుకొస్తా భవిష్యత్ లో కూడా మళ్లీ మీ ముందుకువస్తానని ప్రకటన చేశారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version