పిల్లి క‌రిచి ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతి.. ఆపై పిల్లి కూడా..!

-

పిల్లి క‌రిచి ఇద్ద‌రు మ‌హిళ‌లు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న ఆంధ్ర ప్ర‌దేశ్ లోని కృష్ణా జిల్లాలో గ‌ల వేములమ‌డ‌లో చోటు చేసుకుంది. కాగ వేములమ‌డ‌లోని ద‌ళిత వాడ‌లో గ‌ల క‌మ‌ల‌, నాగ‌మ‌ణిల‌ను రెండు నెల‌ల క్రితం ఒక్క పిల్లి క‌రిచింది. పిల్లి క‌ర‌వ‌డంతో ఇద్ద‌రు కూడా వైద్యులను సంప్ర‌దించారు. వైద్యులు ఈ మ‌హిళ‌ల‌కు టీటీ ఇంజ‌క్షన్లు కూడా తీసుకున్నారు. అలాగే వైద్యుల స‌ల‌హాతో మందులు కూడా వాడారు. దీంతో గాయంతో పాటు ఆరోగ్యం కూడా కుదుట‌ప‌డింది.

అయితే గ‌త నాలుగు రోజుల క్రితం క‌మ‌ల‌, నాగ‌మ‌ణిల‌కు మ‌ళ్లీ ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. దీంతో క‌మ‌ల మంగ‌ళ గిరిలో గ‌ల ఎన్ఆర్ఐ ఆస్ప‌త్రిలో చేరింది. నాగ‌మ‌ణి విజ‌య‌వాడ‌లో ఒక ప్రయివేటు ఆస్ప‌త్రిలో చేరింది. అయితే ఈ ఇద్ద‌రు కూడా శనివారం ఉద‌యం మృతి చెందారు. కాగ పిల్లి క‌ర‌వ‌డంతో విరికీ ర్యాబిస్ వ్యాధి సోకిన‌ట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. కాగ క‌మ‌ల‌, నాగ‌మ‌ణిల‌ను క‌రించింది ఒకే పిల్లి అని గ్రామ‌స్తులు చెబుతున్నారు. అయితే ఆ పిల్లి కూడా ఇటీవ‌ల కుక్క కాటుకు గురి అయి మ‌ర‌ణించింద‌ని గ్రామ‌స్తులు తెల‌పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version