తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 25 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆశిస్తుండగా.. అందులో నలుగురి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డిల పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ఇకపోతే మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను తొలగించి విజయశాంతికి, ప్రేమ్ సాగర్ రావులకు అవకాశం ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో రెండు మంత్రి పదవులను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కింద ఒకరికి మైనారిటీ, ఎస్టీ కోటా కింద పెండింగ్ పెట్టనున్నట్లు సమాచారం.