సాయిగణేశ్ మరణానికి కారణమైన వాళ్లను శిక్షిస్తాం : అమిత్‌ షా

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు అమిత్ షా . బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తేలేదని అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ బెంగాల్ లా మార్చాలనుకుంటున్నారని… దాన్ని ఆపాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

మజ్లిస్ కు కేసీఆర్ భయపడుతున్నారన్న అమిత్ షా … అందుకే కశ్మీర్ లో 370 ఎత్తేసేందుకు కేసీఆర్ వ్యతిరేకించారని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ విమోచనం దినోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చినా..చేయడం లేదని, కేసీఆర్ ను గద్దె దించి.. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సం నిర్వహిస్తుందన్నారు అమిత్ షా. టీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఓవైసీ చేతులో ఉందని, ఇటువంటి ప్రభుత్వాన్ని మార్చేందుకే సంగ్రామ యాత్ర చేపట్టామని అమిత్ షా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version