నేడు కొమురవెల్లి రైల్వేస్టేషన్ కు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

మనోహరాబాద్-కొత్తపల్లి మధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే మార్గంలో ఉన్న కొమురవెల్లిలో కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్ నిర్మించి.. భక్తులకోసం ట్రైన్ ఆగేందుకు మార్గం సుగమమైంది. కొత్తపల్లి-మనోహరాబాద్ మార్గంలో కొమురవెల్లి రైల్వేస్టేషన్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి నేడు మ.3 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. 500 ఏళ్ల నాటి పురాతనమైన ఈ శివాలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

ఈ మార్గంలో కొత్త రైల్వే లైన్ పనులు పూర్తి కాగా.. మల్లన్న భక్తుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్ డిమాండ్ తెరపైకి వచ్చింది. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ అవసరం గురించి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైల్వేశాఖ మంత్రికి పలుమార్లు లేఖలు రాసి రైల్వేస్టేషన్ ఏర్పాటుకు కేంద్రాన్ని ఒప్పించారు.సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ప్రతి ఏటా సంక్రాంతి కి జాతర మొదలై ఉగాది వరకు మల్లన్న జాతర వైభవంగా జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version