సుశాంత్ సింగ్ తండ్రిని కలిసిన కేంద్ర మంత్రి..!

-

బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. అటు బాలీవుడ్ లో, ఇటు రాజకీయాల్లో సంచలనం రేపిన ఈ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా సుశాంత్ సింగ్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కలిశారు. హర్యానాలోని ఫరీదాబాద్ కు వెళ్లిన అథవాలే… సుశాంత్ తండ్రి కేకే సింగ్, సోదరి రాణి సింగ్ తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించుకున్నారు. హీరోయిన్ రియా చక్రవర్తి గురించి కేంద్ర మంత్రికి సుశాంత్ తండ్రి వివరించారు. ఈ కేసులో రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ రియా చ‌క్ర‌వ‌ర్తికి శుక్రవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబైలోని సీబీఐ కార్యాలయానికి అన్ని ఆధారాలతో రియా హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news