వైసీపీ నుంచే వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో పోటీ చేస్తా – వల్లభనేని వంశీ

-

వైసీపీ నుంచే వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో పోటీ చేస్తానని పేర్కొన్నారు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేసినా చేయక పోయినా వైసీపీ తరపున పోటీ చేసేది నేనే, గెలిచేది నేనేనని… కొంత మందికి నేను ఏ వర్గం వారైనా పదవులు ఇచ్చానని గుర్తు చేశారు.

వాళ్ళు అది కాపాడుకొంటే మంచిదని…ఎన్నికల్లో ఓడిపోగానే నేను తట్టా బుట్ట సర్దుకొని పోలేదన్నారు. నేను ఎంపీగా పోటీచేసిన సమయంలో కూడా నా కార్యాలయం గన్నవరంలో ఉందని.. నేను ఓడిపోతే నా కార్యాలయాన్ని తీసేసి తట్టా బుట్ట సర్దుకొనిపోలేదని వెల్లడించారు.

దుట్టా రామచంద్రరావు కూతురుకి ఉంగుటూరు జడ్పీటీసీ పదవి ఇచ్చినందుకు నా మీద కోపం పెంచుకున్నాడు అనుకుంటానని.. సంకల్ప సిద్ది కేసులో నాపై చేసిన ఆరోపణలపై గన్నవరం కోర్టులో పరువు నష్టం దావా వేసానని వెల్లడించారు. పట్టాభి పై మాత్రమే పరువునష్టం దావా వేసానని తెలిపారు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version