వాస్తు: ఆర్ధిక సమస్యలేమీ లేకుండా ఉండాలనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యండి..!

-

వాస్తుని అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పైగా అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా ఉంటే కూడా వాస్తుని అనుసరించడం మంచిది. దీని వల్ల మంచి కలుగుతుంది.

వాస్తు ని అనుసరిస్తే ఆర్ధిక సమస్యలు కూడా వుండవు. అయితే మరి ఆర్ధిక సమస్యలేమీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఇలా అనుసరించమని పండితులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ముత్యాల శంఖం తో నీళ్ళని నింపి లక్ష్మీ దేవి కి సమర్పిస్తే చాలా మంచిదని… దీని వలన ధనం కలుగుతుందని ఆర్థిక బాధలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.

పూజ గదిలో శంఖాన్ని ఉంచడం చాలా మంచిదని దీని వలన చక్కటి ప్రయోజనాలని పొందొచ్చని వాస్తు పండితులు అంటున్నారు. బుధవారం నాడు శంఖాన్ని ఒక శుభ్రమైన వస్త్రంతో కట్టి దాని మీద కుంకుమ పువ్వు ని ఉపయోగించి స్వస్తికుని పెడితే మంచిది. ఆ తరవాత ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహాలక్ష్మే నమః అని చెప్తే చాలా మంచి కలుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులన్నీ పోయి ఆనందంగా ఉండేందుకు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version