IND vs AUS : విశాఖలో వన్డే మ్యాచ్.. ఎల్లుండి నుంచే టికెట్లు

-

భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 19న విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో వన్డే మ్యాచ్ టికెట్లను శనివారం నుంచి విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. మార్చి 10 నుంచి పేటియం వేదికగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఏసిఏ సెక్రటరీ ఎస్.గోపీనాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

13 నుంచి ఆఫ్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈసారి మూడు కేంద్రాల్లో టికెట్ల విక్రయాలు చేపడుతున్నామని, ఎక్కడెక్కడ అనేది త్వరలోనే తెలియజేస్తామన్నారు. టికెట్ల ధరలు రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3500, రూ.6000గా నిర్ణయించామని పేర్కొన్నారు.

ఈ సారి టికెట్లపై బార్‌కోడ్‌ ఉండడంతో ప్రేక్షకులు స్టేడియం లోపలికి వేగంగా వెళ్లే అవకాశం ఉందన్నారు. నాలుగేళ్ల విరామం తరువాత స్టేడియంలో వన్డే మ్యాచ్‌ జరుగుతుండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సుమారు 1500 మంది పోలీసులతో విధులు నిర్వహించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు… దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version