తెలంగాణ ప్రజలంతా కేసిఆర్ కుటుంబంపై పరువు నష్టం దావా వేయాలి – రాములమ్మ

-

 

 

తెలంగాణ ప్రజలు… కేసీఆర్ కుటుంబం మీద పరువు నష్టం దావా వెయ్యాలి..అన్నారు బిజేపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయ శాంతి. ఒక్క మహిళా లిక్కర్ స్కాం లో ఉండటం ఎంటి? కవిత తెలంగాణ పరువు తీసింది.. అని ఆగ్రహించారు. ఆమె మా పార్టీ నేతలపైన పరువు నష్టం దావవేయడం ఎంటి ? అని నిలదీశారు. కెసిఆర్ నీ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి వెలివేయ్యలి…దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి నీ అంత అవినీతి చేయలేదని ఆరోపించారు.

అవినీతి లో కూడా లిమిట్ దాటారు..మిమ్మల్ని సరైన సమయంలో ed పిలుస్తుందన్నారు.సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు బయటికీ వస్తాయి..నీవూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన మేము ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.మేము తిరగబడితే మీరు తట్టుకోలేరు…5లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీశావని పేర్కొన్నారు.మహిళా లీక్కర్ స్కాం లో ఉందంటే పరువు ఉందా మీకు? అని ప్రశ్నించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version