ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ.. చంద్ర‌బాబు ఆస్తుల‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు..!

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ఆస్తులను ఇటీవ‌ల‌ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా.. తనను విమర్శించే వాళ్లంతా ముందు మీరు మీ ఆస్తులు ప్రకటించాలని నారా లోకేష్‌ డిమాండ్ చేశారు. ‘‘బినామీ భూములు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది.. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. క్రమశిక్షణ, పట్టుదలతో వ్యాపారం, రాజకీయాలు చేస్తున్నాం. కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారంటూ లోకేష్ వ్యాఖ్య‌నించాడు.

అయితే ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పుటిదాకా ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ’ అని విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version