టీడీపి వెధవలకు పశువులకు ఇచ్చే ట్రీట్‌ మెంట్‌ ఇవ్వాలి – విజయసాయి

-

టీడీపి వెధవలకు పశువులకు ఇచ్చే ట్రీట్‌ మెంట్‌ ఇవ్వాలని వైసీపీ రాజ్యసభ సభ్యులు సంచలన ట్వీట్‌ చేశారు విజయ సాయి రెడ్డి. రేప్‌ చేస్తా అంటూ పేలుతున్న అశుద్ధం గంజాయి పాత్రుడి వంటి టీడీపి వెధవలను పశువుల హాస్పిటల్‌ ఆవరణలో ఉండే ఇనుప చట్రంలో కట్టేసి… పశువులకు ఇచ్చే ట్రీట్‌మెంటే ఇవ్వాలని పేర్కొన్నారు.

అర్జంటుగా సైకియాట్రిస్టుకో, బూతవైద్యుడికో చూపించండయ్యా. ముసలాడికి మెంటలో, గాలి సోకిందో, మతిపోయిందో తెలియట్లేదు. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ప్రధానిని పట్టుకుని ఎవరువీళ్ళు ఉత్తరాంధ్రకు అంటున్నాడు. గొలుసులు సిద్ధం చేసుకోండి తెలుగు తమ్ముళ్లూ అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వద్దని గగ్గోలు పెట్టిన బాబు కళ్లు తెరిచి చూడాలి. చైనా అభివృద్ధి నమూనా అని సోది చెప్పాడు మొన్నటిదాకా. ప్రైమరీ స్కూల్ లెవెల్ లోనే చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సబ్జెక్టుగా ప్రవేశపెట్టింది. రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ లో శిక్షణ ఇస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version