పాలాభిషేకాలు దేవుడికి చేయాలి… అడ్డమైన దొంగలకు చేయవద్దు : విజయశాంతి

-

కేసీఆర్ మీద బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దొర అధికారంలోకి రాగానే తెలంగాణ పల్లెలు అనాధలు గా మారాయని, దళిత బిడ్డను సిఎం చేస్తానని అన్నాడు, ఎన్నో వాగ్దానాలు చేశారు, వాగ్దానాలు నచ్చి ఓట్లు వేశారు..పథకాలు నచ్చాయి ఓట్లు వేశారు… దీంతో కేసీఆర్ వాగ్దానాలు మార్చి పోయారని ఆమె అన్నారు. దొడ్డి దారిన సీఎం కేసీఆర్ సీఎం పదవిలోకి వచ్చారని, అయన వచ్చాక 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. తెలంగాణ బిడ్డలకు దొరల ప్రభుత్వం చూస్తే భయం వేస్తోందన్న ఆమె కబ్జాల తెలంగాణ అయ్యింది… భూములన్నీ కబ్జా లోకి వెళ్లాయని అన్నారు.

బీజేపీ మ‌హిళా నేత, ప్ర‌ముఖ సినీ న‌టి విజ‌యశాంతి

కేసీఆర్ దొర ఎన్నికల ముందు నాటు, మందు ఇస్తాడని అన్నారు. పాలాభిషేకాలు దేవుడికి చేయాలి… అడ్డమైన దొంగలకు చేయవద్దని అన్నారు. అన్ని రాష్టాల్లో పెన్షన్లు వస్తున్నాయి… వృద్ధులు పెద్ద వారు జాగ్రత్తగా ఓట్లు వేయాలని అన్నారు. జానారెడ్డి కేసీఆర్ మంచి దోస్తులని పేర్కొన్న ఆమె కాంగ్రెస్ నేతలు పదవులు అమ్ముకున్నారు…. అసహ్యం వేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాను అని ఆమె అన్నారు. అన్యాయం ఎక్కడుంటే రాములమ్మ అక్కడ ఉండి పోరాడుతుంది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version