కేటీఆర్ ను కించపరిస్తే నాలుక కోస్తాం – వినయ్ భాస్కర్

-

కేటీఆర్ ను కించపరిస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు ప్రభుత్వ చీఫ్ విఫ్ వినయ్ భాస్కర్. ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి.. ఓర్వలేకనే రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రతిపక్ష నేత లు జైలు కి ఎందుకు పోయారని నిలదీశారు. నువ్వు జైలుకి ఎందుకు పోయావు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి క్రమమం లో అడ్డంగా దొరికి పోయి జైల్ కి వెల్లవని ఫైర్ అయ్యారు.

నీకు డబ్బులు సంచులు ఇస్తేనే నీకు పిసిసిసి పదవి వచ్చింది అని మీ నేతలే చెప్పారు.. ఇప్పటి వరకు సహనంతో ఉన్నామన్నారు. మా నాయకున్ని మరో సారి కించపరిస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల రక్తంలో పోరాడే గుణం ఉందని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడింది వరంగల్ గడ్డ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో టిఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం లోకి వస్తుందని ప్రభుత్వ చీఫ్ విఫ్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version