ధోని క్రీజ్ లో ఉంటే..TSRTC బస్సు సీట్లో ఉన్నట్లే : సజ్జనార్

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీ ఎండీగా… సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్‌. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్.

ఈ నేపథ్యంలోనే తాజాగా… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ ఆటపై ట్వీట్‌ చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ ఫోటో వాడుకుని..ఆర్టీసీ క్రేజ్‌ పెంచే ప్రయత్నం చేశారు సజ్జనార్‌. “ధోని క్రీజ్ లో ఉన్నప్పుడు, TSRTC బస్సు సీట్లో ఉన్నప్పుడు ఎలాంటి దిగులు ఉండదు.” అంటూ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ ఫోటో ట్యాగ్‌ చేశాడు సజ్జనార్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version