వినాయక చవితి స్పెషల్‌.. రుచికరమైన “సేమియా కేసరి” తయారీ

-

కావలసిన పదార్థాలు :

సేమియా – ఒక కప్పు
చక్కెర – అర కప్పు
కుంకుమ పువ్వు – కొద్దిగా
వేడి పాలు – ఒక టీ స్పూన్‌
జీడిపప్పు – 8
కిస్‌మిస్‌ – 3
నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్స్‌


తయారు చేసే విధానం :వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పును బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి. వాటిని తీసేసి అదే కడాయిలో కిస్‌మిస్‌లను కూడా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి.

దాంతో పాటు కడాయిలో మిగిలిన నెయ్యి పోసి సేమియాను గోల్డెన్‌ కలర్‌ వచ్చేవరకు వేయించాలి. దీంట్లో మరుగుతున్న నీళ్ళను పోసి చక్కెర వేయాలి. చక్కెర బాగా కరిగి నీళ్ళు ఇంకిపోయే వరకు అలాగే కలుపుతుండాలి. చివరగా కుంకుమ పువ్వు కలిపిన పాలను కలపాలి. వేయించుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అందంగా గార్నిష్‌ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version