వైరల్ ఫోటో; భార్య కూరగాయల వ్యాపారం కోసం కోహ్లీ ఎం చేస్తున్నాడో తెలుసా…?

-

సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత జనాలకు సరదా కూడా ఎక్కువైంది కదా…? ఏదైనా సినిమాలో కాస్త సరదా సీన్ కనపడినా, ఏదైనా సరదా ఫోటో బయటకు వచ్చినా చేసే హడావుడి అంతా ఇంతా కాదు గా మరి. ఫన్నీ మీమ్స్ చేస్తూ సరదా సరదాగా సందడి చేస్తారు. గత ఏడాది విడుదలైన ఒక సినిమాలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ దిగాలుగా కూర్చుని ఉంటుంది.

చీర కట్టుకుని బాధ పడుతున్న స్టిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్పట్లో చాలా హడావుడి చేసారు. ఇప్పుడు తాజాగా భారత్‌, శ్రీలంక జట్ల మధ్య గౌహతీలో జరగాల్సిన తొలి టీ 20 మ్యాచ్ రద్దు అయింది కదా ఆ సమయంలో పిచ్ మీద తేమ ఎక్కువగా ఉందని కోహ్లీ వెళ్లి పిచ్ మీద మోకాళ్ళతో కూర్చుని పరిశీలిస్తూ ఉంటాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కోహ్లీ బాబు సంక్రాంతికి ముగ్గులు వేస్తున్నావా అంటూ పలువురు కామెంట్ చేస్తుంటే ఇప్పుడు ఒక ఫన్నీ పిక్ బయటకు వచ్చింది. అనుష్క శర్మ దిగాలుగా కూర్చుని ఉంటే ఆమె ముందు ముగ్గు వేస్తూ ఉంటాడు. అనుష్క కూరగాయలు అమ్ముతూ ఉంటుది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్యకు కూరగాయల వ్యాపారం చేస్తుంటే లక్ష్మీ దేవి రావాలని కోహ్లి ముగ్గు వేస్తున్నాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version