విశ్వనాథన్‌ ఆనంద్‌నే తికమక పెట్టిన కవలలు

-

చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌నే తికమక పెట్టారు కవల బాలికలు. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న చెస్‌ ఒలింపియాడ్‌లో ఆనంద్‌ ప్రశ్న-జవాబుల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవల బాలికలు ఆ చెస్‌ దిగ్గజాన్ని ఏం అడగాలో అని ఆలోచించి ‘చెస్‌బోర్డులో పావులను ఎలా రీసెట్‌ చేయాలి?’ అని అడిగారు. దానికి ఆనంద్‌ సమాధానమిస్తుండగా మళ్లీ ఒక బాలిక లేచి.. ‘ప్రత్యర్థి పావులను ఎలా గందరగోళానికి గురి చేయాలి?’ అని అడిగింది.

దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆనంద్‌.. ‘అలా చేయడానికి నా వద్ద ఎలాంటి ఉపాయాలు లేవు’ అని బదులిచ్చాడు. అయితే, ఈ వీడియోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అది ఇప్పుడు వైరల్‌గా మారింది. చివరికి ఆనంద్‌ కూడా ఆ వీడియోను ‘క్వశ్చన్‌ ఆఫ్‌ ది డే’ అని ప్రశంసిస్తూ తిరిగి పోస్టు చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version