నిబంధనలు పాటిస్తే వారికి కూడా రూ.లక్ష సాయం చేస్తాం : మంత్రి పొంగులేటి

-

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు 400-600 చ.అడుగుల మధ్యే నిర్మించుకోవాలని.. అలాంటి వాటికే బిల్లులు చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 600 చ.అడుగులు దాటి నిర్మించుకుంటున్నారని.. వాటికి బిల్లులు హోల్డ్ చేశామన్నారు.

వీటిని పడగొట్టడం కంటే ప్రస్తుతానికి 600 చ.అడుగులు దాటి బేస్ మెంట్ పూర్తయిన ఇళ్లకు ఈ సారికి మినహాయింపు ఇచ్చి రూ.లక్ష రిలీజ్ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు వ్యతిరేకంగా విస్తీర్ణంలో బెస్ మెంట్ వరకు పూర్తయిన ఇళ్లు దాదాపు 300 వరకు ఉన్నాయని వీటికి మిహనహాయింపు ఇస్తున్నామన్నారు. ఇది కేవలం బేస్ మెంట్ వరకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఆపై జరిగే బ్రిక్స్ వర్క్ నిబంధనలకు అనుగుణంగా 400-600 చ.అడుగులలోపు నిర్మిస్తేనే మిగతా బిల్లులు చెల్లిస్తామన్నారు.అది కూడా కేవలం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమయ్యే ఇళ్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news