అణుబాంబులు వేస్తాం.. భారత్‌కు రష్యాలోని పాక్ దౌత్యవేత్త హెచ్చరిక

-

ఇండియా, పాకిస్తాన్ నడుమ యుద్ధమేఘాలు కమ్ముకున్న తరుణంలో దాయాది దేశం తరఫున కొందరు నేతలు భారత్‌ను బెదిరించే ప్రకటనలు చేస్తున్నారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నది. దీంతో భయంతో వణికిపోతున్న దాయాది పాక్ ప్రేలాపనలు చేస్తున్నది.

తాజాగా రష్యాలోని పాక్‌ దౌత్యవేత్త మహమ్మద్‌ ఖలీద్‌ జమాలీ మరోసారి అణ్వాయుధాలను చూపి భారత్‌ని బెదిరించే యత్నం చేశారు.ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాల శక్తిని వినియోగిస్తామన్నారు.ఈ మేరకు రష్యా చానల్‌ ఆర్‌టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘పాక్ భూభాగంపై భారత్ సైనిక దాడులను ప్లాన్ చేస్తోందని ఇస్లామాబాద్‌కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉంది.ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్‌ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది.యుద్ధం వస్తే తాము సంఖ్యాబలం అనే మాయలో పడబోమని.. ప్రజల మద్దతుతో అణుశక్తిని పూర్తిగా వినియోగిస్తాం’ అని జమాలీ పేర్కొనడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news