పెన్షన్ పెంపు పై ఇచ్చిన హామి ఏమైంది : హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో మర్డర్లు – 500 డకాయిటీస్ – 60, రాబరీస్ – 400, తెఫ్ట్ కేసులు – 10,000, రేప్ కేసులు -1800 పోయిన ఒక్క నెలలోనే జరిగాయని తెలిపారు.  హైదారాబాద్ నగరంలో ఒక్క నెలలోనే 28 మర్డర్లు జరిగాయి ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నది.. రేవంత్ రెడ్డే హోంమంత్రి పదవిని తన దగ్గర పెట్టుకున్నాడని పేర్కొన్నారు హరీష్ రావు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక పెద్ద ధోకా పార్టీ అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో భాగమైన పెన్షన్ పెంపు ఏమైందన్నారు. గ్రామాల్లో ముసలివారు రూ.4వేల పెన్షన్ ఎప్పుడొస్తుందన్నారు. రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2016 కి బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందన్నారు. కేవలం సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇస్తామని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version