ఇక ఇప్పుడు ఈ బుల్లితెర స్టార్స్ పరిస్థితి ఏమిటి..?

-

బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలు ఎంతోమందికి లైఫ్ ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్ల సైతం సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలాంటి వారిలో సుడిగాలి సుదీర్, అనసూయ ఒకరిని చెప్పవచ్చు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వీరిద్దరికి డబల్ క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అలా వీరు వెండితెరపై కూడా పరిచయమయ్యారు. ఇలా ఒకవైపు సినిమాల్లో మరొకవైపు బుల్లితెరపై నటిస్తు ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు. జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడి స్టార్ మా చానల్స్ లో యాంకర్లుగా చేయడం జరిగింది.

స్టార్ మా లో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ తదితర కార్యక్రమాలకి హోస్టుగా వ్యవహరిస్తూ ఉండేవారు. ఇక ఈ కార్యక్రమం కూడా తాజాగా కొద్ది రోజుల క్రితం పూర్తి కావడంతో అనసూయ, సుదీర్ ఇద్దరు కూడా పలు కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అభిమానులలో మరింత ఆసక్తి కలిగించే విషయమేమిటంటే. వీరిద్దరూ ఉద్దేశపూర్వకంగానే బుల్లితెరకు దూరంగా ఉన్నారా.? లేకపోతే వీరికి అవకాశాలు లేవా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక గత కొద్ది రోజుల క్రితం సుధీర్ కు అనారోగ్య సమస్యతో కూడా బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే సుధీర్ విషయంలో మాత్రం ఆయన అభిమానులు జబర్దస్త్ వీడి తప్పు చేశారని భావిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం నుంచి బయటకు రావడంతో అనసూయ, సుధీర్ కు ఏ ఇతర కార్యక్రమాలలో కూడా అవకాశాలు రాలేదని తెలియజేస్తూ ఉన్నారు. దాదాపుగా బుల్లితెరపై ఎన్నో సంవత్సరాలు వీరి కెరియర్ ఎంతో అద్భుతంగా సాగిందని చెప్పవచ్చు . అయితే చే చేతులారా వీరి కెరియర్ నాశనం చేసుకుంటున్నారని మరి కొంతమంది అభిప్రాయంగా తెలియజేస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version