బాలయ్యకి వారంటే ఎందుకంత భయం..?

-

నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటనతోనే కాదు బుల్లితెరపై హోస్టుగా కూడా వ్యవహరిస్తూ తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇకపోతే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె టాక్ షో రెండవ సీజన్ కూడా మొదలైంది. మొదటి ఎపిసోడ్ తోనే సంచలనం సృష్టించింది. 24 గంటల్లోనే 10 లక్షల పైగా వ్యూస్ సాధించినట్లు ఆహా టీం అధికారికంగా ప్రకటించారు. మొదటి సీజన్లో నటసింహాలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ప్రతి ఎపిసోడ్ కూడా అన్ స్టాపబుల్ అనిపించుకుంది. దీంతో రెండవ సీజన్ పై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ క్రమంలోనే రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ కూడా శుక్రవారం నుంచి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. బావబామ్మర్ది మధ్య ఆసక్తికరమైన సంభాషణతో సాగిన ఈ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎన్నో విషయాలను వెల్లడించిన నారా చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత జీవితాల గురించి అలాగే రాజకీయ పార్టీ విషయాల గురించి కూడా వెల్లడించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన భార్యతోను, తన కోడలితోను ఫోన్ మాట్లాడడం వంటివి వినోదాన్ని పంచాయి . ముఖ్యంగా బ్రాహ్మణికి ఫోన్ చేసినప్పుడు ఆమె తన తండ్రి బాలకృష్ణ గురించి చెప్పిన మాటలు నందమూరి అభిమానులకు సంతోషాన్ని కలిగించాయి.

నాన్న అన్ స్టాపబుల్ మాత్రమే కాదు .. అన్ కంట్రోలబుల్ కూడా అంటూ నారా బ్రాహ్మణి చెప్పిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఇదే క్రమంలో నేను భయపడేది ఒక్క బ్రాహ్మణికి మాత్రమే.. ఎందుకంటే బ్రాహ్మణి పర్ఫెక్షనిష్ట్.. నేను కూడా పర్ఫెక్షనిష్ట్ అందుకే బ్రాహ్మణికి నేను భయపడాల్సి వస్తోంది అంటూ చమత్కరించారు బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version