MP అవినాష్ రెడ్డి సిబిఐ కి ఎందుకు సహకరించడం లేదు…

-

నిన్న సిబిఐ తరపున లాయర్లు హై కోర్ట్ లో జడ్జి కు తమకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని వివరించడం జరిగింది. మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు అనుమానం ఉన్న చాలా మందిని విచారించమని.. కానీ అందరూ మాకు సరిగా విచారణ చేయడానికి సహకరించారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం మేము ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము అన్నారు. ఈ కేసులో దర్యాప్తు కోసం అవినాష్ రెడ్డికి ఇప్పటికి చాలా సార్లు నోటీసులు పంపించామని.. కానీ ఎప్పటికప్పుడు ఏవేవో కారణాలు చెబుతూ విచారణకు గైర్హాజరు అవుతున్నారంటూ తమ బాధను చెప్పుకున్నారు. ఈ కేసులో విచారణను అడ్డుకోవడానికి మొదటి నుండి ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ చెప్పారు. ఇక ముందస్తు బెయిల్ కోసం అని కోర్ట్ ల చుట్టూ తిరుగుతూ పిటిషన్ లు వేస్తున్నారంటూ సిబిఐ తరపున లాయర్ కోర్టుకు చెప్పుకున్నారు.

కాగా ఈ రోజు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పైన వాదనలు జరుగుతున్నాయి. అయితే ప్రజలు కూడా ఎందుకు అవినాష్ రెడ్డి వివేకా హత్యలో ప్రమేయం లేనప్పుడు విచారణకు సహకరించడం లేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version