కరోనా కష్ఠాలు ఎప్పటికి తీరునో తెలీక చస్తుంటే ఈ పాన్ ఇండియా సినిమా పిచ్చేంటి స్వామీ …?

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక ఒకవైపు రాజమౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తూనే మరోవైపు త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కి మైల్ స్టోన్ (30) సినిమా కావడం విశేషం. వాస్తవంగా అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రారంభమయి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండవలసింది.

Jr NTR And Trivikram Team Up For #NTR30 | Espicyfilms.com

 

కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలవదని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పార్ట్ గనక కంప్లీట్ అయితే అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలున్నాయని సమాచారం. అంతేకాదు ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించే విధంగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నారట. అన్ని అనుకున్నట్టు కంప్లీటయితే వచ్చే సమ్మర్ కి సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే నటించనుందని అంటున్నారు. అంతేకాదు మరో హీరోయిన్ కూడా ఉండనుందట. కాని ప్రస్తుతానికి ఆ హీరోయిన్ ఎవరన్నది క్లారిటి లేదు.

అయితే ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమా అంటూ బాగా హడావుడి మొదలైంది. ప్రత్యేకంగా హీరోలు, దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటి సాధించాలనే పాకులాడుతున్నారు. కావాలనే స్క్రిప్ట్స్ ని ఆ స్థాయిలో రాసుకుంటున్నారు. ఇష్టమొచ్చినట్టు బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. కాని ప్రస్తుతం కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమలేవి ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. అయినా కూడా ప్రతీ సినిమాని పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవడం కొంతమంది విభేదిస్తున్నారట. ఇలాంటి సమయంలో కుడా ఇంత భారీ బడ్జెట్ సినిమాలు అవసరమా .. కాస్త మీడియం రేంజ్ సినిమాలు ప్లాన్ చేయోచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news