అధిష్టానం ఆదేశిస్తే కెసిఆర్ పై పోటీ చేస్తా: రఘునందన్ రావు

-

బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్ పై పోటీచేసి గెలుస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. నల్గొండ పట్టణంలో సోమవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు రఘునందన్ రావు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో జానారెడ్డి ఓటమితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిందన్నారు.

హుజరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ రూ. 500 కోట్లు ఖర్చు పెట్టినా బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచారని, టిఆర్ఎస్ పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నందున బీజేపీ నాయకులు ప్రజల్లోనే ఉండి పోరాడితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. అగ్నిపధ్ పధకం పై ప్రతిపక్షాలు రాజకీయం చేసి కేంద్రాన్ని భద్నాం చేస్తున్నాయన్నారు. నిరసన తెలియజేసే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు. రైల్వే ఆస్తుల్ని తగలబెడితే రాష్ట్ర పోలీసులు ఏం చేశారని, నిఘా వ్యవస్థ ఎక్కడ పోయింది అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version